ఢిల్లీ చేరిన నేపాల్ ప్రధాన మంత్రి

- September 15, 2016 , by Maagulf
ఢిల్లీ చేరిన నేపాల్ ప్రధాన మంత్రి

నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ గురువారం ఢిల్లీ చేరారు. భార్య సీతతో కలిసి వచ్చిన ఆయనకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం అనంతరం ఆగస్ట్ 4న ప్రచండ మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మూడు రోజుల పర్యటనకు వచ్చారు. శుక్రవారం మోదీతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అవుతారు. నేపాల్ కొత్త రాజ్యాంగం ఏర్పాటుతో గత కొద్ది నెలలుగా గాడి తప్పిన ఇరు దేశాల సంబంధాలు ప్రచండ రాకతో మెరుగయ్యే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com