1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాల దొంగలు పట్టివేత

- September 21, 2016 , by Maagulf
1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాల దొంగలు పట్టివేత

మస్కట్ :  ముత్తరః  మరియు సీబ్ ప్రాంతాలలో బంగారు దుకాణాలలో 1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాలని దొంగిలించిన ఘటనకు సంబంధించిన  ఆసియా జాతీయులు సమూహ చోరులను  రాయల్ ఒమాన్ పోలీసులు పట్టుకొన్నారు. సీబ్ మరియు ముత్తరః  పోలీసు స్టేషన్లు సహకారంతో, విచారణలు మరియు మస్కట్ గవర్నటీ  క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్ జనరల్ ఈ కేసుని చేధించారు. రాయల్ ఒమాన్ పోలీసులకు చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ దొంగలు తొలుత  ఆభరణాలను దుకాణాన్నీ ఎంచుకొని రక్షిత లోహ  షట్టర్ కత్తిరించి లోపలకు ప్రవేశిస్తారని ఆయన తెలిపారు. ఈ దొంగలని పెట్టుకొనేందుకు ఒక  ప్రత్యేక బృందం  ఆభరణాల చోరీల దర్యాప్తునకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దొంగలు తమ  నేరాలను ఒప్పుకున్నట్లు చెప్పారు. వీరు తమ  ఇళ్లలో బంగారు వస్తువులు కరిగించి విదేశాలకు ఆ బంగారంనీ  అక్రమంగా స్మగ్లింగ్ చేస్తారని రాయల్ ఒమాన్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com