నిరుద్యోగ బీసీ విద్యార్థులకు శుభవార్త--కొల్లు రవీంద్ర

- September 22, 2016 , by Maagulf
నిరుద్యోగ బీసీ విద్యార్థులకు శుభవార్త--కొల్లు రవీంద్ర

రాష్ట్రంలోని నిరుద్యోగ బీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌మేళా వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిలో రాష్ట్రంలోని వివిధ కంపెనీలు, వాటిలో ఖాళీలు, అర్హతలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. గురువారం రాష్ట్ర బీసీ, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వెబ్‌సైట్‌ను విజయవాడలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీ వెబ్‌సైట్‌ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమకు కావల్సిన కంపెనీని వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు 13 కంపెనీలు, 1048 ఉద్యోగాలు దీనిలో రిజిష్టర్‌ అయ్యాయని ఆయన చెప్పారు. వచ్చే నెల 15వ తేదీన రాజమండ్రిలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు.

ఎన్టీఆర్‌ విదేశీ విద్య రుణం ద్వారా ఇప్పటి వరకు 78 మందిని విదేశాలకు పంపించామన్నారు. 750 మందికి సివిల్స్‌ కోచింగ్‌ ఇస్తున్నామని, 650 మందిని బ్యాంక్‌ పరీక్షల కోసం ఎంపికచేశామని ఆయన తెలిపారు. అలాగే బీసీ యువతను యువపారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు రూ. 25 లక్షలతో చిన్నయూనిట్లను నెలకొల్పుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com