'బంగారు తాళి' పథకానికి భారీ నిధులు కేటాయింపు
- September 22, 2016
తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన 'తాళికు తంగమ్' పథకానికి 2016-17 సంవత్సరానికి గాను రూ.204 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 12,500 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. పేద కుటుంబాలకు చెందిన వధువులకు బంగారు మంగళసూత్రం చేయించేందుకు ఈ పథకం ద్వారా నగదును అందిస్తారు. ఇదే పథకం కింద పదవ తరగతి ఉత్తీర్ణులైన అమ్మాయిలకు రూ.25,000, డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసిన వారికి రూ.50,000 ఆర్థికసాయం కింద ప్రభుత్వం ఇస్తుంది.
2011 ఎన్నికల సందర్భంగా ఏఐఏడీఎంకే నిరుపేద కుటుంబాల వధువులకు 4 గ్రాముల బంగారు మంగళసూత్రం చేయించి ఇస్తామని హామీ ఇచ్చింది.
2016 శాసనసభ ఎన్నికల సందర్భంగా దాన్ని రెట్టింపు చేస్తూ 8గ్రాముల బంగారం ఇస్తానని హామీ ఇచ్చింది. జయలలిత నియోజకవర్గమైన డా.రాధాక్రిష్ణన్ నగర్, కాంచీపురంలలో ఈ పథకాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు 8 గ్రాముల బంగారు నాణేలను అందించారు. 2016 మే 23 తర్వాత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 12,500 మంది మహిళలకు 8గ్రాముల బంగారు నాణేన్ని, అంతకు ముందు దరఖాస్తు చేసుకున్న 1.4 లక్షల మందికి 4 గ్రాముల బంగారు నాణేన్ని అందివ్వనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







