'బంగారు తాళి' పథకానికి భారీ నిధులు కేటాయింపు

- September 22, 2016 , by Maagulf
'బంగారు తాళి' పథకానికి భారీ నిధులు కేటాయింపు

తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన 'తాళికు తంగమ్‌' పథకానికి 2016-17 సంవత్సరానికి గాను రూ.204 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 12,500 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. పేద కుటుంబాలకు చెందిన వధువులకు బంగారు మంగళసూత్రం చేయించేందుకు ఈ పథకం ద్వారా నగదును అందిస్తారు. ఇదే పథకం కింద పదవ తరగతి ఉత్తీర్ణులైన అమ్మాయిలకు రూ.25,000, డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసిన వారికి రూ.50,000 ఆర్థికసాయం కింద ప్రభుత్వం ఇస్తుంది.
2011 ఎన్నికల సందర్భంగా ఏఐఏడీఎంకే నిరుపేద కుటుంబాల వధువులకు 4 గ్రాముల బంగారు మంగళసూత్రం చేయించి ఇస్తామని హామీ ఇచ్చింది.

2016 శాసనసభ ఎన్నికల సందర్భంగా దాన్ని రెట్టింపు చేస్తూ 8గ్రాముల బంగారం ఇస్తానని హామీ ఇచ్చింది. జయలలిత నియోజకవర్గమైన డా.రాధాక్రిష్ణన్‌ నగర్‌, కాంచీపురంలలో ఈ పథకాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు 8 గ్రాముల బంగారు నాణేలను అందించారు. 2016 మే 23 తర్వాత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 12,500 మంది మహిళలకు 8గ్రాముల బంగారు నాణేన్ని, అంతకు ముందు దరఖాస్తు చేసుకున్న 1.4 లక్షల మందికి 4 గ్రాముల బంగారు నాణేన్ని అందివ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com