ఫుట్ బాల్ మ్యాచ్ తిలకించేందుకు షేక్ మహమ్మద్ ను ఆహ్వానించిన పోప్

- September 24, 2016 , by Maagulf
ఫుట్ బాల్ మ్యాచ్ తిలకించేందుకు షేక్ మహమ్మద్ ను ఆహ్వానించిన  పోప్

వచ్చే నెల అక్టోబర్ 12 వ తేదీన రోమ్ లో శాంతి కోసం జరగనున్న ఒక ఫుట్ బాల్ మ్యాచ్ తిలకించేందుకు హాజరు కావాలని కోరుతూ యు ఏ ఇ  వైస్ ప్రెసిడెంట్ ,ప్రధానమంత్రి మరియు దుబాయ్ యొక్కపాలకుడు శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయంకు  పోప్ ఫ్రాన్సిస్ ఒక ప్రత్యేక ఆహ్వానం పంపారు.
దుబాయ్ క్రీడలు రాయబారిగా వ్యవహరిస్తున్న అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ డియెగో మారడోనా  షేక్ మహమ్మద్ కు పొప్ పంపిన ఆహ్వానంను స్వయంగా బట్వాడా చేయనున్నారని " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం అందింది. షేక్ మహ్మద్ మరియు పోప్ ఫ్రాన్సిస్ సమక్షంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ ప్రపంచాల మధ్య సహనం, శాంతిని పెంచేందుకు దోహదపడుతుందని, ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ మ్యాచ్ లో పాల్గొననున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com