బహరేన్ లో ముగ్గురు నిర్వాసిత మహిళలని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్
- September 25, 2016
మనామా: ఒక భద్రతా గార్డు ముగ్గురు థాయ్ మహిళలని కిడ్నాప్ చేయడమే కాక వారి నుంచి మొబైల్ ఫోన్లను దోచుకున్నాదని కోర్టు తెలిపింది. బాధితురాళ్ళ స్నేహితుల ద్వారా ఈ కేసు విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.హోటల్ లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల రికార్డ్ చేసిన వీడియోని సమీక్షించిన తర్వాత పోలీసులు 25 ఏళ్ల ప్రతివాది ఆ మహిళలను ఒక వాహనంలో తీసుకెళ్ళినట్లు కనుగొన్నారు. ఆ వీడియో ఫుటేజ్ లో ఆ వ్యక్తి ముందుకు వెళ్లి ఆ మహిళలతో మాట్లాడి ఒక నల్ల కారులో వారిని తీసుకెళ్లడం జరిగిందని కొద్దిసేపటి తర్వాత వచ్చారు, ఆ తర్వాత పరిశోధకులు ఆమె ముఖంపై గాయాలను గుర్తించారు. గాయపడిన మహిళ పోలీసు అధికారులకు చెబుతూ, తమకు కారు నడిపేందుకు ఒక అవకాశం ఇస్తానని చెప్పాడు..దాంతో అతని కారులో ఎక్కేమని తెలిపారు. కానీ, ఆ వ్యక్తి ఒక తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మా ఫోన్లు మరియు డబ్బు దోచుకున్నాడు. భయపడిన మేము అతని నుంచి తప్పించుకోవడానికి కారు నుంచి కిందకు దూకినట్లు చెప్పారు. ఈ ముగ్గురిని ఒక ఫోటో క్రమం ద్వారా గుర్తించారు.ఇందులోని నిందితుడిపై పోలీసులు అపహరణ మరియు దోపిడీ అభియోగాలు నమోదు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







