బాంబు పేలి 9మందికి గాయాలు : పాకిస్థాన్‌

- September 26, 2016 , by Maagulf
బాంబు పేలి 9మందికి గాయాలు : పాకిస్థాన్‌

పోలీసు వ్యాన్‌ లక్ష్యంగా జరిగిన బాంబు దాడిలో నలుగురు పోలీసులు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. సోమవారం పాకిస్థాన్‌లోని చార్సద్దాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం సారోకల్లే ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసు వాహనం లక్ష్యంగా దుండగులు రిమోట్‌తో బాంబు పేల్చారు. బాంబు ధాటికి నలుగురు పోలీసులు సహా తొమ్మిది మంది బాటసారులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయ సిబ్బందితో పాటుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారినిచికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో వారిని పెషావర్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com