బాంబు పేలి 9మందికి గాయాలు : పాకిస్థాన్
- September 26, 2016
పోలీసు వ్యాన్ లక్ష్యంగా జరిగిన బాంబు దాడిలో నలుగురు పోలీసులు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. సోమవారం పాకిస్థాన్లోని చార్సద్దాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం సారోకల్లే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం లక్ష్యంగా దుండగులు రిమోట్తో బాంబు పేల్చారు. బాంబు ధాటికి నలుగురు పోలీసులు సహా తొమ్మిది మంది బాటసారులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయ సిబ్బందితో పాటుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారినిచికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో వారిని పెషావర్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







