సినీ దర్శకుడు, నిర్మాత తిరువీ ధి గోపాలకృష్ణ కన్నుమూశారు
- September 27, 2016
సినీ దర్శకుడు, నిర్మాత తిరువీ ధి గోపాలకృష్ణ(82) కన్నుమూశారు. ఫిలింనగర్లోని స్వగృహంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు కొద్ది కాలం క్రితం చనిపోయాడు. రెండో కుమారుడు సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. మురళీమోహన్ హీరోగా నటించిన వస్తా డే మా బావ, శివాజీ రాజా న టించిన అహో బ్రహ్మ, ఓహో శిష్య తదితర సినిమాలకు గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. 10 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సారథి స్టూడియోలో తొలినాళ్లలో సిని మా నిర్మించిన వారిలో ఈయన ఒకరు. ఫిలింనగర్ సొసైటీ ఏర్పాటులోనూ కృషి చేశారు. సొసైటీ సభ్యుడిగా పదేళ్లు, కోశాధికారిగా ఏడేళ్లు సేవలందించారు.డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లు, మా అసోసియేషన్కు సభ్యుడిగా ఉన్నారు. మంగళవారమే ఆయన అంత్యక్రియలు పూర్త య్యాయి. గోపాలకృష్ణ భౌతికకాయానికి సినీ ప్రముఖులు, నిర్మాతలు నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









