సినీ దర్శకుడు, నిర్మాత తిరువీ ధి గోపాలకృష్ణ కన్నుమూశారు
- September 27, 2016
సినీ దర్శకుడు, నిర్మాత తిరువీ ధి గోపాలకృష్ణ(82) కన్నుమూశారు. ఫిలింనగర్లోని స్వగృహంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు కొద్ది కాలం క్రితం చనిపోయాడు. రెండో కుమారుడు సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. మురళీమోహన్ హీరోగా నటించిన వస్తా డే మా బావ, శివాజీ రాజా న టించిన అహో బ్రహ్మ, ఓహో శిష్య తదితర సినిమాలకు గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. 10 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సారథి స్టూడియోలో తొలినాళ్లలో సిని మా నిర్మించిన వారిలో ఈయన ఒకరు. ఫిలింనగర్ సొసైటీ ఏర్పాటులోనూ కృషి చేశారు. సొసైటీ సభ్యుడిగా పదేళ్లు, కోశాధికారిగా ఏడేళ్లు సేవలందించారు.డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లు, మా అసోసియేషన్కు సభ్యుడిగా ఉన్నారు. మంగళవారమే ఆయన అంత్యక్రియలు పూర్త య్యాయి. గోపాలకృష్ణ భౌతికకాయానికి సినీ ప్రముఖులు, నిర్మాతలు నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







