భారత్-చైనా ఉగ్రవాదం పై ఉమ్మడి పోరు...
- September 27, 2016
భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొనేందుకు సంయుక్తంగా ముందుకెళ్లాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత-చైనా నిర్ణయించాయి. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈమేరకు మంగళవారం భారత-చైనా అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించాయి. కాగా ఉగ్రవాదంపై రెండు దేశాలు చర్చలు జరపడం ఇదే తొలిసారి. భారత తరఫున సంయుక్త నిఘా విభాగం చైర్మన్ ఆర్.ఎన్.రవి, చైనా నుంచి రాజకీయ, న్యాయవ్యవహారాల సెక్యూరిటీ జనరల్ వాంగ్ యంగ్కింగ్లు ఈ చర్చలలో పాల్గొన్నారు. ఉగ్రవాద నిర్మూలన, భద్రత అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు.కాగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించాలనే భారత డిమాండ్కు విభేదిస్తూ వస్తున్న చైనా మెత్తబడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









