భారత్-చైనా ఉగ్రవాదం పై ఉమ్మడి పోరు...
- September 27, 2016
భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొనేందుకు సంయుక్తంగా ముందుకెళ్లాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత-చైనా నిర్ణయించాయి. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈమేరకు మంగళవారం భారత-చైనా అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించాయి. కాగా ఉగ్రవాదంపై రెండు దేశాలు చర్చలు జరపడం ఇదే తొలిసారి. భారత తరఫున సంయుక్త నిఘా విభాగం చైర్మన్ ఆర్.ఎన్.రవి, చైనా నుంచి రాజకీయ, న్యాయవ్యవహారాల సెక్యూరిటీ జనరల్ వాంగ్ యంగ్కింగ్లు ఈ చర్చలలో పాల్గొన్నారు. ఉగ్రవాద నిర్మూలన, భద్రత అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు.కాగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించాలనే భారత డిమాండ్కు విభేదిస్తూ వస్తున్న చైనా మెత్తబడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







