చైనాలో ఘోర ప్రమాదం
- September 28, 2016
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించడంతో 19 మంది కార్మికులు మృతిచెందారు. నింగ్జియా హుయ్ ప్రాంతంలోని షిజుయ్షన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
లిన్లీ కోల్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్కు చెందిన ఓ చిన్నపాటి బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 20 మంది కార్మికులు గనిలో పనిచేస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తిని సహాయక సిబ్బంది కాపాడారు.
అయితే ఆ వ్యక్తి కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మైనింగ్ కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









