చైనాలో ఘోర ప్రమాదం

- September 28, 2016 , by Maagulf
చైనాలో ఘోర ప్రమాదం

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించడంతో 19 మంది కార్మికులు మృతిచెందారు. నింగ్జియా హుయ్‌ ప్రాంతంలోని షిజుయ్‌షన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

లిన్లీ కోల్‌ మైనింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఓ చిన్నపాటి బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 20 మంది కార్మికులు గనిలో పనిచేస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తిని సహాయక సిబ్బంది కాపాడారు.

అయితే ఆ వ్యక్తి కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మైనింగ్‌ కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com