వృద్ధులకోసం వీలుగా ఇ-సర్వీసులు
- September 30, 2016
షార్జా: షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇ-గవర్నమెంట్ (డిఎజి), సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేక అవసరాలు ఉంటాయని గుర్తించి, వారికి వీలుగా డిజిటల్ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది. ఎల్డర్లీ సర్వీసెస్ ఫోరం 2016 ఐదవ ఎడిషన్ కార్యక్రమంలో 'ది కరెంట్ అండ్ ఫ్యూచర్ సర్వీసెస్ ఫర్ ఎల్డర్లీ బై షార్జా సిటీ ఎన్టైటీస్' పేరుతో జరిగిన సెషన్లో, డిఇజి ఈ అంశాన్ని ప్రస్తావించింది. షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సర్వీస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కలిసి ఈ ఫోరంని నిర్వహించారు. వృద్ధుల కోసం ఇ-సర్వీసుల్ని అదనంగా, ప్రత్యేకంగా వివిధ విభాగాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిఇజి అభిప్రాయపడింది. డిఇజి డైరెక్టర్ జనరల్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి మాట్లాడుతూ, సొసైటీలో వృద్ధుల్ని ప్రత్యేక కేటగిరీగా భావించి వారికి ప్రత్యేక సేవల్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ ఏజెన్సీలు, ఫోరంలో వెల్లడయిన అభిప్రాయాలతో ఏకీభవించి, వృద్ధులకు మేలైన సర్వీసులు అందించేందుకు ముందుకొస్తామని వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







