అద్భుతమైన ఆఫర్లతో జిటెక్స్ ఆటమ్న్ 2016 ప్రారంభం
- October 01, 2016
దుబాయ్: ఎనిమిదిరోజులపాటు జరిగే అత్యద్భుతమైన షాపింగ్ ఫెస్టివల్కి దుబాయ్ రిటెయిలర్స్ సంసిద్ధమయ్యారు. జిటెక్స్ షాపర్ ఆటమ్న్ 2016 26 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈసారి ఇంకా అద్భుతంగా ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 8 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఈ షాపింగ్ మెగా ఈవెంట్ జరుగుతుంది. శ్యామ్సంగ్, హెచ్టిసి, సోనీ వంటి సంస్థలు స్మార్ట్ ఫోన్లతో వినియోగదారుల్ని ఆకర్షించనున్నాయి. హెచ్పి, డెల్, ఆసుస్, ఏసర్ సంస్థలు పీసీలు, గేమింగ్ మెషీన్లు, ప్రింటర్లను ప్రదర్శించనున్నాయి. అవి ఇవీ అన్నీ ఈ షాపింగ్ ఫెస్టివల్లో వినియోగదారుల కోసం కొలువుదీరుతున్నాయి. లార్జ్ స్క్రీన్ టీవీలు, స్మార్ట్ మొబైల్స్, ట్యాబ్స్, పీసీలు, ల్యాప్టాప్లు ఈ షోలో ప్రధాన ఆకర్షనగా నిలుస్తాయి. షాపింగ్ ఫెస్టివల్ అనగానే ఆకర్షించే బహుమతులూ మామూలే కదా. ఈసారి గతంలో కన్నా అద్భుతమైన ఆఫర్లతో, బహుమతులతో షాపింగ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలు బంపర్ ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షించనున్నాయి. షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రతిసారిలానే ఈసారి కూడా ఉంటుందనీ, ఇంకా గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వినియోగదారులు కూడా జిటెక్స్ ఆటమ్న్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







