నెస్లే ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఊరట లభించింది
- August 14, 2015
మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఊరట లభించింది. ఈ కంపెనీ తయారు చేసిన 9 రకాల నూడుల్స్పై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాథికార సంస్థ(ఎఫ్ఎ్సఎ్సఏఐ), మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్(ఎఫ్డీఏ) విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం కొట్టేసింది. నూడుల్స్పై నిషేధం విధించడానికి సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, పైగా నూడుల్స్లోని సీసం, ఇతర రసాయనాల పరిమితిని పరీక్షించిన ల్యాబరేటరీలకు తగిన గుర్తింపు లేదని జస్టిస్ వి.ఎం.కనడే, జస్టిస్ బి.పి.కొలాబవాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నెస్లే వాదన వినకుండానే ఆ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన పంజాబ్, హైదరాబాద్, జైపూర్లోని స్వతంత్ర ల్యాబ్స్లో నెస్లేకి చెందిన వివిధ రకాల నూడుల్స్ను పరీక్షించి... 6వారాల్లో నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. సీసం స్థాయి పరిమితికి లోబడే ఉంటే... నూడుల్స్ తయారీ, విక్రయాలకు నెస్లే కంపెనీని అనుమతించాలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసం ఉన్నట్లు ఎఫ్ఎ్సఎ్సఏఐ పరీక్షల్లో తేలడంతో దేశవ్యాప్తంగా వీటి విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో నెస్లే హైకోర్టునాశ్రయించింది. ఇక, బాంబే హైకోర్టు తీర్పును చూసి... సవాలు చేయడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఎఫ్ఎ్సఎ్సఏఐ చైర్మన్ ఆశిశ్ బహుగుణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









