నెస్లే ఇండియా లిమిటెడ్‌ కంపెనీకి ఊరట లభించింది

- August 14, 2015 , by Maagulf
నెస్లే ఇండియా లిమిటెడ్‌ కంపెనీకి ఊరట లభించింది

మ్యాగీ నూడుల్స్‌ తయారీదారు నెస్లే ఇండియా లిమిటెడ్‌ కంపెనీకి ఊరట లభించింది. ఈ కంపెనీ తయారు చేసిన 9 రకాల నూడుల్స్‌పై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాథికార సంస్థ(ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ), మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ డిపార్ట్‌మెంట్‌(ఎఫ్‌డీఏ) విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం కొట్టేసింది. నూడుల్స్‌పై నిషేధం విధించడానికి సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, పైగా నూడుల్స్‌లోని సీసం, ఇతర రసాయనాల పరిమితిని పరీక్షించిన ల్యాబరేటరీలకు తగిన గుర్తింపు లేదని జస్టిస్‌ వి.ఎం.కనడే, జస్టిస్‌ బి.పి.కొలాబవాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నెస్లే వాదన వినకుండానే ఆ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన పంజాబ్‌, హైదరాబాద్‌, జైపూర్‌లోని స్వతంత్ర ల్యాబ్స్‌లో నెస్లేకి చెందిన వివిధ రకాల నూడుల్స్‌ను పరీక్షించి... 6వారాల్లో నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. సీసం స్థాయి పరిమితికి లోబడే ఉంటే... నూడుల్స్‌ తయారీ, విక్రయాలకు నెస్లే కంపెనీని అనుమతించాలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసం ఉన్నట్లు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ పరీక్షల్లో తేలడంతో దేశవ్యాప్తంగా వీటి విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో నెస్లే హైకోర్టునాశ్రయించింది. ఇక, బాంబే హైకోర్టు తీర్పును చూసి... సవాలు చేయడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ చైర్మన్‌ ఆశిశ్‌ బహుగుణ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com