నెస్లే ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఊరట లభించింది
- August 14, 2015
మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఊరట లభించింది. ఈ కంపెనీ తయారు చేసిన 9 రకాల నూడుల్స్పై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాథికార సంస్థ(ఎఫ్ఎ్సఎ్సఏఐ), మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్(ఎఫ్డీఏ) విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం కొట్టేసింది. నూడుల్స్పై నిషేధం విధించడానికి సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, పైగా నూడుల్స్లోని సీసం, ఇతర రసాయనాల పరిమితిని పరీక్షించిన ల్యాబరేటరీలకు తగిన గుర్తింపు లేదని జస్టిస్ వి.ఎం.కనడే, జస్టిస్ బి.పి.కొలాబవాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నెస్లే వాదన వినకుండానే ఆ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన పంజాబ్, హైదరాబాద్, జైపూర్లోని స్వతంత్ర ల్యాబ్స్లో నెస్లేకి చెందిన వివిధ రకాల నూడుల్స్ను పరీక్షించి... 6వారాల్లో నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. సీసం స్థాయి పరిమితికి లోబడే ఉంటే... నూడుల్స్ తయారీ, విక్రయాలకు నెస్లే కంపెనీని అనుమతించాలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసం ఉన్నట్లు ఎఫ్ఎ్సఎ్సఏఐ పరీక్షల్లో తేలడంతో దేశవ్యాప్తంగా వీటి విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో నెస్లే హైకోర్టునాశ్రయించింది. ఇక, బాంబే హైకోర్టు తీర్పును చూసి... సవాలు చేయడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఎఫ్ఎ్సఎ్సఏఐ చైర్మన్ ఆశిశ్ బహుగుణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







