ఎర్రకోటపై రెపరెపలాడుతున్న జాతీయ జెండా

- August 14, 2015 , by Maagulf
ఎర్రకోటపై రెపరెపలాడుతున్న జాతీయ జెండా

బ్రిటిష్ పరిపాలనకు చరమగీతం పాడి 69 సంవత్సరాలు గడచిన నేపథ్యంలో జాతి యావత్తూ చిరునవ్వులు చిందిస్తుండగా దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఎంపీలు, రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొని దేశమాతకు వందనాలు సమర్పించారు. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com