బంజరాహిల్స్లోని అలయెన్స్ ఫ్రాంచైజ్లో యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్
- October 04, 2016
యానిమేటెడ్ ఫిల్మ్స్ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఆరంభంలో ఫ్రాన్స్లోని వేరువేరు నగరాల్లో ఈ చిత్ర ప్రదర్శన నిర్వహించేవారు. క్రమంగా దీనిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. అందులోభాగంగానే హైదరాబాద్ లోని బంజరాహిల్స్లోని అలయెన్స్ ఫ్రాంచైజ్లో యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. సిమోన్ రోబీ దర్శకత్వం వహించిన అదామా (85నిమిషాలు) చిత్రంతో ఫెస్టివల్ని ప్రారంభించనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐదు లఘు చిత్రాలు ప్రదర్శించన్నురు. ఫ్రెంచ్ ఆర్ట్ మోడల్, సింగర్, నటీమణి జీవితంపై రూపొందించిన మడేమోయిసెల్లె కికి ఎట్ ఎల్స్ చిత్రా న్ని కూడా ప్రదర్శిస్తుండడం గమనార్హం.ఫెస్టివల్లో భాగంగా గోబెలిన్ ఎల్ ఎకోల్ దే ఎల్ ఇమేజ్ విద్యార్థులు రూపొందించిన యానిమేటెడ్ లఘు చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటిని పిల్లల కోసం 19న సాయంత్రం 5:30 గంటలకు, పెద్దలకు 6:45 నిమిషాలకు ప్రదర్శించనున్నారు. వీటిలో పలు అవార్డ్ విన్నింగ్ చిత్రాలు సైతం ఉన్నాయి. అక్టోబర్ 26న ఫొలిమేజ్ స్టూడియోస్ రూపొందిచిన లఘుచిత్రాలను ప్రద్శర్శించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







