పెయిన్ కిల్లర్స్తో జాగ్రత్త
- August 14, 2015
నడుం నొప్పి, కాలు నొప్పి, ఒళ్లు నొప్పులు అంటూ వచ్చే నొప్పులకు మనం బ్రూఫిన్, ఆస్ప్రిన్, డైక్లో ఫినాక్ వంటి పెయన్ కిల్లర్స్ని ఈజీగా వాడేస్తుంటాం. ఇలాంటి మందులు ఇదివరకటి రోజుల్లో అంతగా మన శరీరం మీద ప్రభావం చూపించలేకపోవచ్చు, కానీ ప్రస్తు పరిస్థితుల్లో మన శరీరంలోని అతి మఖ్యమైన భాగం గుండెపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. వీటి వాడకం వల్ల గుండె పోటు వచ్చే అవకాశమే కాకుండా పక్షపాతం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. వీటినే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్( ఎన్ఎస్ఏఐడీలు) అంటారు. ఇవి రక్తంలోని ప్లేట్ లెట్స్పై ఆస్ప్రిన్ కన్నా భిన్నంగా పని చేస్తాయి. తద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్లేట్ లెట్స్ అన్నీ ఒక్క దగ్గరకు చేరి రక్తం గడ్డకట్టకుండా చేసే ఎంజైమును ఆస్ప్రిన్ అడ్డుకుంటుంది. ఈ రకమైన మందులు రక్తం గడ్డం కట్టడాన్ని ప్రోత్సహించే మరికొన్ని ఎంజైముల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటి వాడకాన్ని ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









