పెయిన్ కిల్లర్స్తో జాగ్రత్త
- August 14, 2015
నడుం నొప్పి, కాలు నొప్పి, ఒళ్లు నొప్పులు అంటూ వచ్చే నొప్పులకు మనం బ్రూఫిన్, ఆస్ప్రిన్, డైక్లో ఫినాక్ వంటి పెయన్ కిల్లర్స్ని ఈజీగా వాడేస్తుంటాం. ఇలాంటి మందులు ఇదివరకటి రోజుల్లో అంతగా మన శరీరం మీద ప్రభావం చూపించలేకపోవచ్చు, కానీ ప్రస్తు పరిస్థితుల్లో మన శరీరంలోని అతి మఖ్యమైన భాగం గుండెపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. వీటి వాడకం వల్ల గుండె పోటు వచ్చే అవకాశమే కాకుండా పక్షపాతం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. వీటినే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్( ఎన్ఎస్ఏఐడీలు) అంటారు. ఇవి రక్తంలోని ప్లేట్ లెట్స్పై ఆస్ప్రిన్ కన్నా భిన్నంగా పని చేస్తాయి. తద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్లేట్ లెట్స్ అన్నీ ఒక్క దగ్గరకు చేరి రక్తం గడ్డకట్టకుండా చేసే ఎంజైమును ఆస్ప్రిన్ అడ్డుకుంటుంది. ఈ రకమైన మందులు రక్తం గడ్డం కట్టడాన్ని ప్రోత్సహించే మరికొన్ని ఎంజైముల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటి వాడకాన్ని ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







