యాంటీ టెర్రర్ చట్టంపై జిసిసి మంత్రుల చర్చ
- October 06, 2016
రియాద్: ఆరు గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన జస్టిస్ మినిస్టర్స్ సమావేశమై, జిసిసి దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు, జస్టిస్ విభాగంలో కలిసి పనిచేయడం, అలాగే తీవ్రవాద సంబంధిత సమస్యలపై చర్చించారు. 28వ మినిస్టీరియల్ మీటింగ్ ఆఫ్ ది జిసిసి జస్టిస్ మినిస్టర్స్ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ జస్టిస్ వాలిద్ అల్ సమాని నాయకత్వం వహించారు. జిసిసి రీజియన్ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోందనీ, అందులో ముఖ్యమైనది తీవ్రవాదమని ఆయన చెప్పారు. అలాగే జిసిసి దేశాల మధ్య మనుషుల అక్రమరవాణా, దీనికి సంబంధించి కేసుల విచారణ సందర్భంగా జిసిసి దేశాల మధ్య జస్టిస్ చట్టాల పట్ల అవగాహన, కలిసి పని చేయడం వంటి అంశాలపైన కూడా చర్చ జరిగింది. కొత్త చట్టాలు చేసే విషయంలో పరస్పర సమాచార మార్పిడి, అవగాహన వంటి విషయాలూ చర్చకు వచ్చాయి. జస్టిస్ ఎగైనెస్ట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం (జెఎఎస్టిఎ)పై చర్చ సందర్భంగా, జిసిసి దేశాలు తీవ్రవాదం కారణంగా ఎదుర్కొన్న అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జెఎఎస్టిఎపై సుదీర్ఘమైన చర్చ జరగాల్సి ఉందనీ, ఇది అంతర్జాతీయ చట్టాల నిబందనలకు వ్యతిరేకంగా ఉందని అల్ సమాని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









