ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- March 08, 2026
యూఏఈః గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల కారణంగా కొన్ని యూఏఈ ఆకర్షణలు తాత్కాలికంగా ప్రజలకు తలుపులు మూసివేసాయి. ఇరానియన్ డ్రోన్లు మరియు క్షిపణుల నిరంతరం అడ్డుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, దాడుల కారణంగా కాకుండా, వాటి శకలాల వల్ల గాయాలు సంభవించాయని యూఏఈ స్పష్టం చేసింది.
పరిస్థితి సురక్షితంగా ఉందని, యుద్ధం ఎంతకాలం కొనసాగినా దాడులను ఎదుర్కోవడానికి రక్షణ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ప్రజల భద్రత కోసం జాగ్రత్తలు చాలా అవసరం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రధాన నిర్ణయాలను అధికారులు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారిక నిబంధనలకు అనుగుణంగా కొన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసాయి.
గ్లోబల్ విలేజ్
వారాంతాల్లో భారీగా విజిటర్స్ ను ఆకర్షించే దుబాయ్ లోని ప్రసిద్ధ ఆకర్షణ.. మార్చి 7 మరియు 8 తేదీలలో అధికారుల గైడ్ లైన్స్ ప్రకారం మూసివేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఐన్ దుబాయ్
ఐన్ దుబాయ్ కు సంబంధించి ఇప్పటికే బుకింగ్లు కలిగి ఉన్నవారు తాజా సమాచారం కోసం వెబ్సైట్ను సందర్శించాలని ప్రకటించింది. ఈ వీకెండ్ మూసివేయనున్నట్లు ప్రకటించారు.
పార్క్లు మరియు రిసార్ట్లు
ముందు జాగ్రత్త చర్యగా ఈ వీకెండ్ లో దుబాయ్ పార్క్లు మరియు రిసార్ట్లు మూసివేయబడతాయని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ రిసార్ట్ గమ్యస్థానంలో రివర్ల్యాండ్ దుబాయ్తో పాటు మోషన్గేట్, లెగోలాండ్ వంటి ప్రధాన థీమ్ పార్కులు ఉన్నాయి. ఇవి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









