బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లోంచి గట్టెక్కిన వలసదారుడు
- October 07, 2016
మనామా: ఉద్యోగం కోల్పోయి, రోడ్లపై బిచ్చమెచ్చుకుంటూ దయనీయ స్థితుల్లో జీవితం వెల్లదీస్తున్న వ్యక్తిని స్వదేశానికి పంపించారు. పలువురు కార్మికులు, ఇండియన్ ఎంబసీ సహాయంతో రాసిక్ కుమార్ ఛగన్లాల్ పాంచాల్ అనే వ్యక్తి బహ్రెయిన్ నుంచి ఇండియాకి వెళ్ళగలిగాడు. ఈ సందర్భంగా తనకు సహకరించినవారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు పాంచాల్. యూఏఈలో కొన్నేళ్ళపాటు పనిచేసిన పాంచాల్, 2006లో బహ్రెయిన్ చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళు పెయింటింగ్ సూపర్ వైజర్గా జీవితం బాగానే ఉన్నా, ఉద్యోగం పోయాక, పరిస్థితులు మారిపోయాయి. అప్పులు పెరిగిపోవడం, ట్రావెల్ బ్యాన్ వంటి విషయాలతో చితికిపోయాడు పాంచాల్. బిచ్చమెత్తుకుంటూ 20 బహ్రెయినీ దినార్స్ అద్దెను చెల్లించి షెల్టర్ పొందానని, ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనని పాంచాల్ చెప్పాడు. చాలాకాలం తర్వాత తన కుటుంబ సభ్యుల్ని కలుసుకోబోతున్నాననీ, మళ్ళీ తాను ప్రాణాలతో ఇండియాకి వెళతానని అనుకోలేదని వెళుతూ వెళుతూ కన్నీరుమున్నీరయ్యాడు పాంచాల్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







