పార్కింగ్ టిక్కెట్స్ ఫోర్జరీ: 150,000 దిర్హామ్ల జరీమానా
- October 11, 2016
దుబాయ్: ఓ వాహన డ్రైవర్కి 150,000 దిర్హామ్ల ఫైన్ విధించిన ఘటన దుబాయ్లో చోటుచేసుకుంది. 41 ఏళ్ళ ఇండియన్ డ్రైవర్, పార్కింగ్ టిక్కెట్ని ట్యాంపర్ చేస్తూ ఎమిరేటీ ఇన్స్పెక్టర్కి దొరికేశాడు. అల్ ఖాన్సా రౌండెబౌట్ వద్ద ఏప్రిల్ 21న ఈ ఘటన వెలుగు చూసింది. ఆ తరువాత మళ్ళీ మూడు రోజులకు ట్యాంపర్ టిక్కెట్తో పార్కింగ్ చేయడంతో ఇన్స్పెక్టర్కి అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో ఫోర్జింగ్ కుట్ర వెలుగు చూసింది. నిందితుడికి న్యాయస్థానం 15,000 దిర్హామ్ల జరీమానా విధించింది. కేవలం కొద్ది దిర్హామ్లను మిగుల్చుకునేందుకు చేసిన ఈ ఫోర్జరీ కారణంగా, పెద్ద మొత్తంలో నిందితుడు జరీమానా చెల్లించాల్సి వచ్చింది. నిందితుడి నుంచి రెండు ఫోర్జరీ చేసిన పార్కింగ్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని 15 రోజుల్లోగా నిందితుడు అపీల్ చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







