పాకిస్తాన్ ఎదురుకాల్పులలో భారత జవాను మృతి

- October 16, 2016 , by Maagulf
పాకిస్తాన్ ఎదురుకాల్పులలో భారత జవాను మృతి

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. రాజౌరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై పాక్ ఉగ్రదాడి అనంతరం భారత్ మెరుపుదాడులు నిర్వహించినప్పటి నుంచీ పాక్ కాల్పులకు తెగబడుతోంది. నిత్యం భారత పోస్టులపై కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పులకు భారత్ ధీటుగా జవాబిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com