బ్రెజిల్ జైల్లో కలకలం
- October 17, 2016
బ్రెజిల్ ఉత్తర ప్రాంతలోని రొరైమా రాష్ట్ర రాజధాని బవా విస్టా నగరంలో వున్న జైలులో ఆదివారం రాత్రి ఖైదీల మధ్య జరిగిన ఘర్షణల్లో 25 మంది మరణించినట్లు పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. జైల్లో జరిగిన ఘర్షణలో మృతుల్లో ఏడుగురికి తల నరికివేశారని, మరో ఆరుగురిని సజీవ దహనం చేశారని పోలీసులు తెలిపారు. ఖైదీలలో ఒక వర్గం వారు మరో వర్గంపై దాడి చేసినపుడు ఈ ఘర్షణ చెలరేగింది. కత్తులు, కర్రల వంటి మారణాయుధాలు చేపట్టి ఖైదీలు తమ ప్రత్యర్థులపై దాడి చేశారని జైలులోనే వున్న ఖైదీలలో ఒకరి భార్య మీడియాకు చెప్పింది. ఖైదీలను సందర్శించేందుకు వారి బంధువులు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ చెలరేగిందని, ఖైదీలకు చెందిన దాదాపు వంద మంది బంధితులను కొద్దిసేపు నిర్బంధించారని రొరైమా న్యాయశాఖ మంత్రి ఉజీల్ కాస్ట్రో వివరించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







