పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ‘నేత్ర’
- October 17, 2016
రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంది. నవంబర్ రెండో వారంలో ఆడియో విడుదల చేసి అదే నెల చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘‘ విశాఖ, అరకు, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ జరిపాము. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దర్శకుడు చిత్రాన్ని చెప్పిదానికంటే కూడా అద్భుతంగా తెరకెక్కించారు. అవుట్ పుట్ పట్ల యూనిట్ సభ్యులమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. నవంబర్ రెండో వారంలో ఆడియో విడుదల చేసి, అదే నె చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్ మాట్లాడుతూ... ‘గతంలో నేను ‘లైఫ్’ అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తూ నటించాను. ‘నేత్ర’ నా రెండో సినిమా. ఈ సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేశాను. దీన్ని లవ్ అండ్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించాము. సిటీ నేపథ్యంతో పాటు గ్రామీణ నేపథ్యంలో కూడా కథ నడుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. ఫైనల్ అవుట్ పుట్ చూసిన మా నిర్మాత చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఒక మంచి సినిమా చేశామంటూ టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్నాం. నటీనటుందరూ కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సత్యానంద్గారు, వారి అబ్బాయి పాత్రలు సినిమాకు చాలా కీలకంగా ఉంటాయి. వీరిరువురూ కలిసి నటించడం ఇదే ప్రథమం’’ అన్నారు.
గోపిచరణ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, స్టార్మేకర్ సత్యానంద్, ఐకె త్రినాధ్, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్ చరణ్, తిరుమరెడ్డి, జబర్దస్త్ అప్పారావు, జనార్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్నాగ్ రతన్దాస్, మాటలు ప్రసాదుల మధుబాబు, కెమెరా: ఎస్.వి. గోపాల్, ఎడిటింగ్: నర్సింగ్ రాధోడ్, కొరియోగ్రఫి: లుక్స్ రాజశేఖర్, బాలకృష్ణ, ఫైట్స్: బాజీరావు, నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







