పక్షులను పట్టుకొనే పరికరాలను విక్రయిస్తున్న దుకాణాలు మూసివేత

- October 23, 2016 , by Maagulf
పక్షులను పట్టుకొనే పరికరాలను విక్రయిస్తున్న దుకాణాలు మూసివేత

దోహా: పక్షులను ఆకర్షించి వాటిని పట్టుకోనేందుకు ఉపయోగించే పరికరాలను అమ్మే పలు దుకాణాలు  అల్ జిబర ప్రాంతంలో అధికారులు పట్టుకొన్నారు. మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ, అల్ షామల  సెక్యూరిటీ  తనిఖీ విభాగానికి చెందిన  అధికారుల సహకారంతో ఈ దాడులు నిర్వహించారు.  33  పక్షి ఆకర్షక  పరికరాలను మంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తదుపరి దర్యాప్తు తర్వాత దుకాణ యజమానులపై చర్యలు తీసుకొనబడతాయని సంబంధిత అధికారుల  అధికారిక వెబ్సైట్ లో తెలిపారు. ర్యావరణంను రక్షించే చట్టంను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ  చట్టాలను ఉల్లంఘించే వారు ఎవరికైనా  విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఈ తరహా పక్షిని బంధించే పరికరాలు విక్రేతలపై ప్రజలు తమకు పిర్యాదు చేయాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com