షార్జా వ్యాపార మండలి అధ్యక్షురాలతో పాటు మరో ఇద్దరు అగ్ని ప్రమాదంలో మృతి
- October 23, 2016
షార్జా వ్యాపార మహిళా మండలి (SBWC) అధ్యక్షరాలు ఆమె కుటుంబ సభ్యులు ఇరువురు వారి ఇంటిలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో వారాంతంలో మరణించారు. షార్జా వ్యాపార మహిళా మండలి అధ్యక్షరాలు అమీరా బిన్ కరమ్ చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించాయి, శనివారం క్యాడిసియాహ్ లోని ఆమె ఇంటిలో అగ్నికీలలు వ్యాపించి ఆమె తీవ్ర గాయాలతో చనిపోయింది. ఆమెతో పాటు తన 40 ఏళ్ల సోదరి సామా బిన్ కరమ్, మరియు 57 ఏళ్ల తల్లి విపరీతమైన పొగ కారణంగా ఊపిరాడక మరణించారు.
శనివారం సాయంత్రం 4.30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అమీరా బిన్ కరమ్ సోదరుడు ఖలీద్ తీవ్రంగా గాయపడటంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అమీరా బిన్ కరమ్ తండ్రి ఇంట్లో లేకపోవడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగేరు.ఇంటి ముందు భాగం నుండి మొదలై అనంతరం మేడమీద విల్లా గదులు అంతా వ్యాపించి ఆ కుటుంబం మొత్తం మంటలలో చిక్కుకొనిపోయేలా మంటలు వారిని చుట్టిముట్టేయని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అమీరా బిన్ కరమ్ భౌతికకాయాన్ని చూసేందుకు హైనెస్ షెఇఖ జవహేర్ బిన్తె ముహమ్మద్ అల్ ఖ్అసిమి శ్రీశ్రీ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖ్అసిమి షార్జా ఆఫ్ హయ్యర్ సుప్రీం కౌన్సిల్ మరియు రూలర్ సభ్యుడు భార్యతో హాజరై అమీరా మరణానికి తీవ్ర సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







