వారణాసిలో బాణాసంచా వల్ల పేలుడు, ఐదుగురి మృతి

- October 26, 2016 , by Maagulf
వారణాసిలో బాణాసంచా వల్ల పేలుడు, ఐదుగురి మృతి

అక్రమంగా నిల్వ చేసిన బాణాసంచా వల్ల పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన వారణాసిలో చోటుచేసుకుంది. పీతర్‌కుండ్‌ ట్రైసెక్షన్‌ సమీపంలోని ఓ రెండంతస్తుల భవనంలో మంగళవారం అర్థరాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల కారణంగానే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారి నితిన్‌ తివారీ తెలిపారు. మృతుల్లో ఇద్దరు వ్యక్తులను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com