ఉమ్మె సాలలులో మోటర్ బైక్ ప్రమాదంలో భారత యువకుని మృతి
- October 27, 2016
కతర్ యొక్క ఉమ్మె సాలలుఆలీ ప్రాంతంలో పనిపై వెళుతున్న 28 ఏళ్ల ఒక వలస భారతీయ యువకుడు మోటర్ బైక్ రహదారి పై నుంచి జారిపడటంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి సాజిద్ ఆలీ (28) గా గుర్తించబడ్డారు, గత కొంతకాలంగా దోహాలో ఉంటున్నఆ యువకుడు ఒక ప్రైవేట్ సంస్థతో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.ఆ వ్యక్తికి భార్య మరియు ఒక ఏడాది కుమారుడు ఉన్నారు. అతని తండ్రి మొహమ్మద్ ఆలీ, కొంతకాలం నుంచి దోహాలో నివసిస్తున్నాడు.ఒక ప్రైవేట్ ఆటోమోటివ్ సంస్థలో పని చేస్తున్నాడు.ఈ కుటుంబం ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందినవారు. పదిహేను రోజులలో ఇదే తరహాలో రెండవ మరణం అల్ తుమమ సిగ్నల్ సమీపంలో ఒక స్థానిక యువకుడుఒక బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించిన విషయం పాఠకులకు విదితమే
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







