ఉమ్మె సాలలులో మోటర్ బైక్ ప్రమాదంలో భారత యువకుని మృతి

- October 27, 2016 , by Maagulf
ఉమ్మె సాలలులో మోటర్ బైక్ ప్రమాదంలో భారత యువకుని మృతి

కతర్ యొక్క ఉమ్మె సాలలుఆలీ ప్రాంతంలో పనిపై వెళుతున్న 28 ఏళ్ల ఒక వలస భారతీయ యువకుడు మోటర్ బైక్ రహదారి పై నుంచి జారిపడటంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి సాజిద్ ఆలీ (28) గా గుర్తించబడ్డారు, గత కొంతకాలంగా దోహాలో ఉంటున్నఆ యువకుడు  ఒక ప్రైవేట్ సంస్థతో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.ఆ వ్యక్తికి భార్య మరియు ఒక ఏడాది కుమారుడు ఉన్నారు. అతని తండ్రి మొహమ్మద్ ఆలీ, కొంతకాలం నుంచి దోహాలో నివసిస్తున్నాడు.ఒక ప్రైవేట్ ఆటోమోటివ్ సంస్థలో పని చేస్తున్నాడు.ఈ కుటుంబం ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందినవారు. పదిహేను రోజులలో ఇదే తరహాలో రెండవ మరణం అల్ తుమమ సిగ్నల్  సమీపంలో ఒక స్థానిక యువకుడుఒక బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించిన విషయం పాఠకులకు విదితమే 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com