జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెగబడింది

- October 28, 2016 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెగబడింది

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెబడింది. నౌషేరా, సుందర్బని సహా నాలుగు సెక్టార్లలో పాక్‌ ఆర్మీ కాల్పులకు దిగింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పాక్‌ సైన్యం దాడిని భారత జవాన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. తాజా కాల్పుల్లో నలుగురు భారత పౌరులకు గాయాలయ్యాయి. దీంతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బీఎస్ఎఫ్ చీఫ్‌తో మాట్లాడి దీటుగా బదులివ్వాలని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com