ఈ మారణహోమానికి లేదా చరమగీతం?
- October 28, 2016
ఇరాక్లోని మోసుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటూ అందుకు నిరాకరించిన వారిని పాశవికంగా చంపుతున్నారు. మోసుల్ సమీపంలో కనీసం 232 మందిని గతవారంలో ఐఎస్ ఉగ్రవాదులు ఉరితీసినట్టు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వేలాది ప్రజలను బందీలుగా చేసుకుని, ఇరాక్ భద్రతా దళాలపై వారిని మానవ కవచాలకు వాడుకుంటున్నట్టు తెలిపింది. గత బుధవారం మోసుల్ కు దక్షిణాన ఉన్న హమ్మమ్ అల్-అలీల్ లో ఉగ్రవాదులు 42 మంది పౌరులను ఉరితీసినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ హై కమిషనర్ రవీనా శందాసని తెలిపారు. అదే రోజు మోసుల్ సమీపంలోని అల్ ఘజ్లానిలో ఐఎస్ సంస్థలో చేరేందుకు నిరాకరించిన 190 మంది ఊచకోత కోశారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







