ఈ మారణహోమానికి లేదా చరమగీతం?

- October 28, 2016 , by Maagulf
ఈ మారణహోమానికి లేదా చరమగీతం?

 ఇరాక్‌లోని మోసుల్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటూ అందుకు నిరాకరించిన వారిని పాశవికంగా చంపుతున్నారు. మోసుల్ సమీపంలో కనీసం 232 మందిని గతవారంలో ఐఎస్ ఉగ్రవాదులు ఉరితీసినట్టు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వేలాది ప్రజలను బందీలుగా చేసుకుని, ఇరాక్ భద్రతా దళాలపై వారిని మానవ కవచాలకు వాడుకుంటున్నట్టు తెలిపింది. గత బుధవారం మోసుల్ కు దక్షిణాన ఉన్న హమ్మమ్ అల్-అలీల్ లో ఉగ్రవాదులు 42 మంది పౌరులను ఉరితీసినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ హై కమిషనర్ రవీనా శందాసని తెలిపారు. అదే రోజు మోసుల్ సమీపంలోని అల్ ఘజ్లానిలో ఐఎస్ సంస్థలో చేరేందుకు నిరాకరించిన 190 మంది ఊచకోత కోశారని ఆయన చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com