వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు హతం
- October 30, 2016
ఆఫ్ఘనిస్థాన్ దంగామ్ జిల్లాలోని కునార్ ప్రావిన్స్లో ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సంకీర్ణ సేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 19 మంది లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. 8 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ హోంశాఖ అధికారికంగా నిర్ధారించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపిన నేపధ్యంలో ఆఫ్ఘన్ బలగాలు స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సేనలు విరుచుకుపడటం ఇదే ప్రథమం. ఒకప్పుడు భారత్ను మాత్రమే అస్థిరం చేయాలనుకుంటూ తయారుచేసిన లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ పైన కూడా ఉసిగొల్పుతోంది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉగ్రవాదంపై పోరులో భారత్కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. అందుకే ఈ రెండు దేశాలను కూడా పాకిస్థాన్ ఏకకాలంలో టార్గెట్ చేసింది. ఆఫ్ఘనిస్థాన్లో సైన్యానికి అమెరికాతో పాటు భారత్ కూడా శిక్షణనిస్తోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







