వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు హతం

- October 30, 2016 , by Maagulf
వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు హతం

ఆఫ్ఘనిస్థాన్ దంగామ్ జిల్లాలోని కునార్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సంకీర్ణ సేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 19 మంది లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. 8 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ హోంశాఖ అధికారికంగా నిర్ధారించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపిన నేపధ్యంలో ఆఫ్ఘన్ బలగాలు స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సేనలు విరుచుకుపడటం ఇదే ప్రథమం. ఒకప్పుడు భారత్‌ను మాత్రమే అస్థిరం చేయాలనుకుంటూ తయారుచేసిన లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్ పైన కూడా ఉసిగొల్పుతోంది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. అందుకే ఈ రెండు దేశాలను కూడా పాకిస్థాన్ ఏకకాలంలో టార్గెట్ చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యానికి అమెరికాతో పాటు భారత్‌ కూడా శిక్షణనిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com