వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు హతం
- October 30, 2016
ఆఫ్ఘనిస్థాన్ దంగామ్ జిల్లాలోని కునార్ ప్రావిన్స్లో ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సంకీర్ణ సేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 19 మంది లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. 8 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ హోంశాఖ అధికారికంగా నిర్ధారించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపిన నేపధ్యంలో ఆఫ్ఘన్ బలగాలు స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ సేనలు విరుచుకుపడటం ఇదే ప్రథమం. ఒకప్పుడు భారత్ను మాత్రమే అస్థిరం చేయాలనుకుంటూ తయారుచేసిన లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ పైన కూడా ఉసిగొల్పుతోంది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉగ్రవాదంపై పోరులో భారత్కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. అందుకే ఈ రెండు దేశాలను కూడా పాకిస్థాన్ ఏకకాలంలో టార్గెట్ చేసింది. ఆఫ్ఘనిస్థాన్లో సైన్యానికి అమెరికాతో పాటు భారత్ కూడా శిక్షణనిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









