ఐనవోలులో విట్‌ శంకుస్థాపన...

- November 03, 2016 , by Maagulf
ఐనవోలులో విట్‌ శంకుస్థాపన...

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విట్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో వంద ఎకరాల్లో విట్‌ వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. మెడికల్‌ జోన్‌ కింద డెంటల్‌, పారా మెడికల్‌, నర్సింగ్‌ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపడతామని విట్‌ వైస్‌ఛాన్సలర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com