ఖతార్ నుంచి రెమిటెన్స్ల పెరుగదల
- November 03, 2016
ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు సైతం ఖతార్ నుంచి రెమిటెన్స్లను తగ్గించలేకపోయాయనీ, ఈ విభాగంలో జిసిసి దేశాల్లో ఖతార్ పెరుగుదల నమోదు చేసిందని ఎక్స్ప్రెస్ మనీ సంస్థ ప్రకటించింది. గ్లోబల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎక్స్ప్రెస్ మనీ, జిసిసిలో మిగతా దేశాల్లో రెమిటెన్స్లు తగ్గుముఖం పట్టగా, ఖతార్ మంత్ ఆన్ మంత్ గ్రోత్ 22 శాతం నమోదు చేసినట్లు పేర్కొంది. 2015తో పోల్చితే 2016లో పెరుగుదల స్థిరంగా కొనసాగుతుందని తాము వేసిన అంచనాలు నిజమైనట్లు ఎక్స్ప్రెస్ మనీ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీష్ గిఇయాన్ తెలిపారు. ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో జిసిసి దేశాల రెమిటెన్స్ తగ్గుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసినా, ఆ అంచనాలకు భిన్నంగా ఖతార్లో పరిస్థితులు ఉన్నాయి. 2022 ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో దేశం అనుసరిస్తున్న వ్యూహాత్మకమైన విధానాలతో దేశ ఆర్థిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







