వలసదారుల వీసా పెంపు: వేరేదారిలేదు
- November 08, 2016
మస్కట్: మజ్లిస్ అల్ షురా సభ్యుడు తౌఫిక్ అల్ లవాతి మాట్లాడుతూ, వలసదారుల వీసా ఫీజుల్ని పెంచడం తప్ప ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో దేశానికి ఇంకో మార్గం లేదని చెప్పారు. అలాగే తాజా నిర్ణయాలతో సేవలు, వస్తువుల ధరలు పెరగడం వ్యక్తిగతంగా తనకూ ఇష్టం లేకపోయినా, పరిస్థితులు అనుకూలించని కారణంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఎకనమిక్ ప్యానెల్ సభ్యుడు కూడా అయిన తౌఫిక్ అల్ లవాతి దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని, వాటిని అనుసరించి నడచుకోవాల్సి వస్తోందని ఓసిసిసై మెంబర్ అహ్మద్ అల్ హూటి వ్యాఖ్యానించడం జరిగింది. సాధారణ ప్రజలు కొన్ని ఇబ్బందులు భరించాల్సిందేనని వివరించారు. పన్నుల పెంపు కారణంగా వ్యాపార వర్గాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఒమన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసలే కుదేలైన ఆర్థిక రంగం కారణంగా సామాన్యులు ఇబ్బంది పడితే, అన్ని వర్గాలపైనా ప్రభావం కనిపిస్తుందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేశారు. 2016 వాస్తవ బడ్జెట్ని 11.9 బిలియన్లు కాగా, రెవెన్యూస్ కేవలం 8.6 బిలియన్ ఒమన్ రియాల్స్ మాత్రమే ఉంది. పెట్రోల్, డీజిల్ సబ్సిడీల ఎత్తివేత సహా అనేక చర్యలు తీసుకోవడం ద్వారా లోటు భర్తీకి ప్రభుత్వం కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







