భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను ప్రారంభించిన బాలకృష్ణ

- November 09, 2016 , by Maagulf
భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను ప్రారంభించిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. బాలకృష్ణ 100వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌.బి.కె. హెల్పింగ్‌ హ్యాండ్‌ జగన్‌ అండ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని 100 పుణ్య క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చనతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సర్వమత శత పుణ్య క్షేత్ర జైత్రయాత్ర బుధవారం నుంచి ప్రారంభమైంది. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు జెండా వూపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ చిత్రంలో శ్రేయా, హేమమాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'గౌతమిపుత్ర..' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com