భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను ప్రారంభించిన బాలకృష్ణ
- November 09, 2016
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. బాలకృష్ణ 100వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్.బి.కె. హెల్పింగ్ హ్యాండ్ జగన్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని 100 పుణ్య క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చనతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సర్వమత శత పుణ్య క్షేత్ర జైత్రయాత్ర బుధవారం నుంచి ప్రారంభమైంది. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్లు జెండా వూపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ చిత్రంలో శ్రేయా, హేమమాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'గౌతమిపుత్ర..' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







