ఓవర్సీస్ లేబర్ కార్యాలయాలు
- November 09, 2016
జెడ్డా: సౌదీ ప్రభుత్వం, ప్రపంచంలోని పలు దేశాల్లోని తమ ఎంబసీలకు అనుబంధంగా లేబర్ కార్యాలయాల్ని తెరిచేందుకు సమాయత్తమవుతోంది. ఈజిప్ట్, ఇండియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, శ్రీలంక తదితర దేశాల్లో ఈ కార్యాలయాల్ని తెరిచేందుకు వీలుగా క్యాబినెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. స్టాండింగ్ కమిటీ - కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అండ్ డెవలప్మెంట్ రికమండేషన్స్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. లేబర్ రెగ్యులేషన్స్పై అవేర్నెస్ పెంచడమే ఈ కార్యాలయాల స్థాపన ముఖ్య ఉద్దేశ్యం. ఈ నిర్ణయంతో రిక్రూట్మెంట్లు సజావుగా సాగుతాయని, బ్రోకర్స్ నుంచి కార్మికులకు వెసులుబాటు కలుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వర్గాలు వెల్లడించాయి. పైన పేర్కొన్న దేశాల నుంచి ఎక్కువగా సౌదీ అరేబియాకి కార్మికులు వస్తుంటారు. వీరిలో చాలామంది బ్రోకర్ల కారణంగా నష్టపోతున్నారు. తద్వారా ఒక్కోసారి సౌదీ అరేబియా కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రైవేట్ సెక్టార్ సైతం ఈ అక్రమ రిక్రూట్మెంట్లతో సమస్యలను ఎదుర్కొంటున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఎకనమిక్ ఎక్స్పర్ట్స్ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి కూడా ప్రభుత్వానికి అభినందనలు వస్తున్నాయి. కార్మికులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







