అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్కు మోదీ అభినందనలు...
- November 09, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ను అభినందిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య మైత్రిలో కొత్తశకం కావాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భారత్పై స్నేహపూరిత భావన వ్యక్తం చేసిన ట్రంప్ను మోదీ ప్రశంసించారు. 'మీ హయాంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి' అని ప్రధాన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







