'వందేమాతరం' గీతం వి.ఆర్.పద్ధతిలో ...
- November 21, 2016
సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు కూర్చగా దేశాన్ని ఓ ఊపు ఊపేసిన 'వందేమాతరం' గీతం వర్చువల్ రియాలిటీ (వి.ఆర్.) పద్ధతిలో విడుదలైంది. గోవాలోని పణాజీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలోని పదవ ఎనఎఫ్డీసీ ఫిల్మ్ బజార్లో వీఆర్ విధానంలోని ఈ గీతాన్ని సోమవారం ఆవిష్కరించారు. దీంతో 360 డిగ్రీల కోణంలో ఈ గీతాన్ని చూసి ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు కలిగింది. 4కె స్టీరియోస్కోపిక్లో చిత్రించిన ఈ వీడియోలో 'వందేమాతరం' గీతంతో పాటు భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి శ్రద్ధాంజలి ఘటిస్తూ న్యూయార్క్లో ఆగస్ట్ 15న రెహమాన్ నిర్వహించిన కచేరీ కూడా ఉండటం గమనార్హం. ''రోజురోజుకీ కళను మనం ఆస్వాదించే విధానం వాస్తవానికి దగ్గరవుతూ వస్తోంది.
వీఆర్లో 'వందేమాతరం'ను అందించడం ఉద్వేగాన్ని కల్గించింది'' అని చెప్పారు రెహమాన్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







