నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం భారీ ఎత్తున ఎదురు దాడులు..
- November 23, 2016
నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం భారీ ఎత్తున ఎదురు దాడులు చేపట్టింది. జమ్ముకశ్మీర్లోని పూంఛ్, రాజౌరి, ఖేల్, మచ్చిల్ ప్రాంతాల్లో సైన్యం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ముగ్గురు జవాన్లను బలిగొన్న పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పూంఛ్లోని బాలకోట్ సెక్టార్లో పాక్ కాల్పులు జరుపుతోంది. వాళ్లు చేసిన పిరికి చర్యలపై ప్రతీకారం భయంకరంగా ఉంటుందని ఆర్మీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. .మచ్చిల్ సెక్టార్లో మరోసారి మెరుపుదాడులకు పాల్పడేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని, భారత స్థావరాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నారని, అయితే భారత భద్రతా సిబ్బంది అప్రమత్తంగా, ఎదురుదాడులకు సిద్ధంగా ఉన్నారని సైన్యం పేర్కొంది.మంగళవారం నియంత్రణ రేఖ వెంబడి మచ్చిల్ సెక్టార్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







