నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం భారీ ఎత్తున ఎదురు దాడులు..
- November 23, 2016
నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం భారీ ఎత్తున ఎదురు దాడులు చేపట్టింది. జమ్ముకశ్మీర్లోని పూంఛ్, రాజౌరి, ఖేల్, మచ్చిల్ ప్రాంతాల్లో సైన్యం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ముగ్గురు జవాన్లను బలిగొన్న పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పూంఛ్లోని బాలకోట్ సెక్టార్లో పాక్ కాల్పులు జరుపుతోంది. వాళ్లు చేసిన పిరికి చర్యలపై ప్రతీకారం భయంకరంగా ఉంటుందని ఆర్మీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. .మచ్చిల్ సెక్టార్లో మరోసారి మెరుపుదాడులకు పాల్పడేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని, భారత స్థావరాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నారని, అయితే భారత భద్రతా సిబ్బంది అప్రమత్తంగా, ఎదురుదాడులకు సిద్ధంగా ఉన్నారని సైన్యం పేర్కొంది.మంగళవారం నియంత్రణ రేఖ వెంబడి మచ్చిల్ సెక్టార్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







