హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం, 11 మంది సజీవదహనం

- December 04, 2016 , by Maagulf
హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం, 11 మంది సజీవదహనం

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని రెజెంట్‌ ప్లాజా హోటల్‌లో ఉదయం భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవదహనమయ్యారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న వంటగదిలో చెలరేగిన మంటలు కొద్దిసేపట్లోనే ఆరో అంతస్థు వరకు వేగంగా వ్యాపించాయి. మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. హోటల్‌లో బస చేస్తున్న కొందరు తప్పించుకునేందుకు హోటల్‌ భవనంపై నుంచి దూకేశారు. దీంతో కొందరికి ఎముకలు విరగగా మరికొందరికి గాజు పెంకులు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మృతుల్లో ఎక్కువమంది వూపిరాడక ప్రాణాలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు వైద్యులుకూడా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్‌లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు సహాయక బృందం చర్యలు చేపడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com