వియత్నాంలో వరదలు, 13 మంది మృతి

- December 04, 2016 , by Maagulf
వియత్నాంలో వరదలు, 13 మంది మృతి

వరదల కారణంగా వియత్నాం అతలాకుతలం అవుతోంది. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి బిన్‌డిన్‌ ప్రావిన్స్‌లో ఆరుగురు మృతిచెందారు. పదివేల ఇళ్లు నీటమునిగాయి. క్వాంగ్‌నామ్‌ ప్రావిన్స్‌లో ముగ్గురు చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు. సోమవారం నుంచి గురువారం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. వియత్నాంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వరదల కారణంగా ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com