తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్
- December 06, 2016
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(93) తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఇంతకు ముందు కూడా శ్వాసకోశ సమస్యలతో లీలా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
దిలీప్కుమార్ 1922లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కూడా అయిన దిలీప్ కుమార్ తండ్రితో పడక ఇంటినుంచి వచ్చేసి పూణేకు చేరుకుని అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహించారు. అనంతరం బాంబేకు చేరుకుని బాంబే టాకీస్ ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన అసలు నేరు యూసఫ్ ఖాన్ నుంచి దిలీప్ కుమార్గా మార్చుకుని జ్వర్ భట (1944) చిత్రంతో బాలీవుడ్కు పరిచయమయ్యారు. అప్పటనుంచి ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ ట్రాజెడీ కింగ్గా పేరుతెచ్చుకున్నారు. 1998లో చివరి చిత్రం ఖిలా లో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2015 లో పద్మవిభూషణ్ అవార్డులు దిలీప్ను వరించాయి. భార్య అలనాటి ప్రముఖ అందాల బాలీవుడ్ నటి సైరాబాను.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







