తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్
- December 06, 2016
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(93) తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఇంతకు ముందు కూడా శ్వాసకోశ సమస్యలతో లీలా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
దిలీప్కుమార్ 1922లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కూడా అయిన దిలీప్ కుమార్ తండ్రితో పడక ఇంటినుంచి వచ్చేసి పూణేకు చేరుకుని అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహించారు. అనంతరం బాంబేకు చేరుకుని బాంబే టాకీస్ ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన అసలు నేరు యూసఫ్ ఖాన్ నుంచి దిలీప్ కుమార్గా మార్చుకుని జ్వర్ భట (1944) చిత్రంతో బాలీవుడ్కు పరిచయమయ్యారు. అప్పటనుంచి ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ ట్రాజెడీ కింగ్గా పేరుతెచ్చుకున్నారు. 1998లో చివరి చిత్రం ఖిలా లో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2015 లో పద్మవిభూషణ్ అవార్డులు దిలీప్ను వరించాయి. భార్య అలనాటి ప్రముఖ అందాల బాలీవుడ్ నటి సైరాబాను.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









