ఇండోనేషియాలో భూకంపం, 25 మంది మృతి
- December 06, 2016
ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు దాదాపు 25 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.03 గంటల సమయంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భూకంపకేంద్ర ప్రాంతానికి దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. 2004లో ఆసె ప్రాంతంలో ఒకసారి సునామీ వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో దాదాపు 30మీటర్ల ఎత్తున రాక్షస అలలు విరుచుకుపడటంతో దాదాపు 1,70,000 మంది చనిపోయారు. ఇండోనేషియా ద్వీప సమూహం తరచూ భూకంపాలకు గురవుతూ ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ దేశం ఉండటమే దీనికి ప్రధానకారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతాల కారణంగా భూమిపొరల్లో కదలికలు ఏర్పడుతుంటాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







