ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డులకు గల్ఫ్ నుండి 15 మంది ఎంపిక
- December 11, 2016
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా 26 మంది ఎన్నారైలు ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 కు ఎంపికయ్యారు. ఇందులో గల్ఫ్ దేశాలలో నివసించే 15 మంది ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016 ఆదివారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రధానం జరుగుతుంది. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపర్చిన ప్రవాస భారతీయ (ఎన్నారై), భారత సంతతి (పిఐఓ) లను నైపుణ్యం, సామర్ద్యం పాటు మానవతా దృక్పథంతో వారు అందించిన సేవలను గుర్తించి ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించి అవార్డులను ప్రధానం చేయనున్నామని అవార్డుల కమిటీ అధ్యక్షులు ప్రొ. అడపా సత్యనారాయణ తెలిపారు.
అవార్డు గ్రహీతల వివరాలు: ఖతార్ నుండి ఒకరు గుగ్గిళ్ల రవిగౌడ్, సౌదీ అరేబియా నుండి ఇద్దరు శేషుకుమార్ పితాని, మహ్మద్ అబ్దుల్ రహ్మాన్ సలీం, కువైట్ నుండి ముగ్గురు అభిలాష గొడిశాల, రామ్మోహన్ రావ్ కొత్తపల్లి, రాజశేఖర్ చప్పిడి, ఒమాన్ నుండి నలుగురు గిరీష్ కుమార్, రెజిమోన్ కుట్టప్పన్, లింగయ్య పోల్సాని, రాందాస్ చందక, యుఏఇ నుండి ఐదుగురు కె. కుమార్, షరీఫ్ నూరుల్లా, ఇ. తులసి ప్రసాద్, శ్రీకాంత్ చిత్తర్వు, జైతా నారాయణ.
ప్రొ.ఆడప సత్యనారాయణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల అవార్డుల కమిటీ నామినేషన్లను పరిశీలించింది. ఇందులో కట్ట కవిత, అరుణా నాయుడు నిమ్మగడ్డ, డా.కె.స్వరూపా రెడ్డి, నిజాం వెంకటేశం, పి. సునీల్ కుమార్ రెడ్డి లు సభ్యులు.



తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







