అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: నలుగురికి గాయాలు
- December 13, 2016
అబుదాబీ: షేక్ రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్లోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో నలుగురు గాయపడ్డారు. అబుదాబీ సివిల్ డిఫెన్స్, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్ని కీలల్ని నియంత్రించాయి. ఇతర ప్రాంతాలకు మంటలు విస్తరించకుండా సిబ్బంది అడ్డుకున్నారు. మధ్యాహ్నం 2.12 గంటల సమయంలో సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుందని, సహాయక చర్యల్ని ముమ్మరం చేసిందని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ చెప్పారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదాల్ని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







