2015లో 10000 మంది లేబర్‌ అబ్యూజ్‌ బాధితులు

- December 13, 2016 , by Maagulf
2015లో 10000 మంది లేబర్‌ అబ్యూజ్‌ బాధితులు

2015లో 10,000 మంది కార్మికుల్ని స్వదేశాలకు పంపించారు. ఈ వివరాల్ని మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ వెల్లడించింది. ఇలా పంపించేందుకోసం ఖతార్‌ ఖర్చుల్ని భరించిందని అధికారులు వివరించారు. దోహా తాజాగా కాంట్రాక్ట్‌ బేస్డ్‌ సిస్టమ్‌ని విదేశీ వర్కర్స్‌ కోసం అమల్లోకి తెచ్చింది. డిసెంబర్‌ 13 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా వర్కర్స్‌కి మరింత రక్షణ ఏర్పడుతుంది. పాత కఫాలా విధానం ద్వారా స్పాన్సర్స్‌ నుంచి కార్మికులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కొత్త విధానం ద్వారా స్పాన్సర్స్‌ అనుమతి పాత విధానంలో వున్నట్లే వున్నా, దేశం విడిచి వెళ్ళేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా కల్పించారు. ఖతార్‌లో 2.1 మైగ్రెంట్‌ లేబర్స్‌ ఉన్నారు. వీరిలో ఎక్కువమంది 2022 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com