దుబాయ్ లో 50 వేల డి హెచ్ విలువ చేసే పరంజాలను చోరీ చేసిన భారతీయ గార్డు
- December 17, 2016
' కంచె చేను ..మేసిన రీతిలో ' రక్షణగా ఉండాల్సిన 22 ఏళ్ల భారతీయ కార్మికుడు తాను పనిచేసే నిర్మాణ సంస్థకు కుచ్చుటోపీ పెట్టబోయి ఎంచక్కా దొరికిపోయాడు. నిర్మాణ స్థలంలో 50 వేల డి హెచ్ విలువ చేసే పరంజాలను దొంగిలించాడని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఈ మేరకు ఆరోపించబడింది. ఈ దొంగతనం సంఘటన పై జెబెల్ ఆలీ పోలీసు స్టేషన్ కు ఆగస్టు11వ తేదీన నివేదించబడింది.ఆగష్టు 11 వ తేదీన నిర్మాణ కార్మికులు కొన్ని పరంజాలు నిర్మాణ స్థలం నుండి పోయినట్లు గుర్తించారు. వారు ఈ మేరకు ఒక సివిల్ ఇంజనీర్ కు ఈ సమాచారం చెప్పారు. ఈ అపహరణ విషయమై కర్తవ్య నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుని అడగ్గా,ఆ ఉదయం టీ తాగేందుకు వెలుపలికి వెళ్ళినపుడు బహుశా ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని కాకమ్మ కబుర్లు చెప్పబోయాడు.దీనితో ఆ ఇంజినీర్ పోలీసులకు పిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు తమదైన రీతిలో ఆ భారతీయ కార్మికుడిని ప్రశ్నించి వాస్తవం రాబట్టేరు . పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం రెండోవ నిర్మాణ స్థలం నుండి పరంజాలను దొంగిలించి వాటిని ఒక పాకిస్తానీ వ్యక్తికి అమ్మినట్లు నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 26 వ తేదీన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







