దుబాయ్ లో 50 వేల డి హెచ్ విలువ చేసే పరంజాలను చోరీ చేసిన భారతీయ గార్డు
- December 17, 2016
' కంచె చేను ..మేసిన రీతిలో ' రక్షణగా ఉండాల్సిన 22 ఏళ్ల భారతీయ కార్మికుడు తాను పనిచేసే నిర్మాణ సంస్థకు కుచ్చుటోపీ పెట్టబోయి ఎంచక్కా దొరికిపోయాడు. నిర్మాణ స్థలంలో 50 వేల డి హెచ్ విలువ చేసే పరంజాలను దొంగిలించాడని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఈ మేరకు ఆరోపించబడింది. ఈ దొంగతనం సంఘటన పై జెబెల్ ఆలీ పోలీసు స్టేషన్ కు ఆగస్టు11వ తేదీన నివేదించబడింది.ఆగష్టు 11 వ తేదీన నిర్మాణ కార్మికులు కొన్ని పరంజాలు నిర్మాణ స్థలం నుండి పోయినట్లు గుర్తించారు. వారు ఈ మేరకు ఒక సివిల్ ఇంజనీర్ కు ఈ సమాచారం చెప్పారు. ఈ అపహరణ విషయమై కర్తవ్య నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుని అడగ్గా,ఆ ఉదయం టీ తాగేందుకు వెలుపలికి వెళ్ళినపుడు బహుశా ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని కాకమ్మ కబుర్లు చెప్పబోయాడు.దీనితో ఆ ఇంజినీర్ పోలీసులకు పిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు తమదైన రీతిలో ఆ భారతీయ కార్మికుడిని ప్రశ్నించి వాస్తవం రాబట్టేరు . పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం రెండోవ నిర్మాణ స్థలం నుండి పరంజాలను దొంగిలించి వాటిని ఒక పాకిస్తానీ వ్యక్తికి అమ్మినట్లు నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 26 వ తేదీన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









