ఇండినేసియాలో 13మంది మృతి

- December 17, 2016 , by Maagulf
ఇండినేసియాలో 13మంది మృతి

ఇండినేసియాలోని పపువా ప్రావిన్స్‌లో వైమానికదళ విమానం కూలి 13మంది మృతిచెందారు. టిమికా ప్రాంతం నుంచి వుమెనాకు సైనికుల కోసం ఆహారపదార్థాలను తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ తెలిపారు. మృతుల్లో ముగ్గురు పైలట్లు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద ద్వీప సమూహమైన ఇండోనేసియాను తరచూ జరుగుతున్న ప్రమాదాలు కుంగదీస్తున్నాయి. ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్న ఆ దేశ సైన్యానికి విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాలు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com