యెమెన్‌లో 30 మంది సైనికులు మృతి

- December 18, 2016 , by Maagulf
యెమెన్‌లో 30 మంది సైనికులు మృతి

యెమెన్‌లోని అడెన్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈశాన్య అడెన్‌ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం వద్ద జీతాలు తీసుకునేందుకు నిలబడిన సైనికులు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకూ ప్రకటించలేదు. వారం రోజుల వ్యవధిలో అడెన్‌ ప్రాంతంలో సైనికులపై రెండోసారి దాడి జరగడం గమనార్హం. ఈనెల 10వ తేదీన అడెన్‌లోని సైనిక స్థావరం వద్ద సైనికులు జీతాలు తీసుకునేందుకు వేచి ఉన్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగి 50 మంది సైనికులు మృతిచెందారు. ఆ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com