యెమెన్లో 30 మంది సైనికులు మృతి
- December 18, 2016
యెమెన్లోని అడెన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈశాన్య అడెన్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం వద్ద జీతాలు తీసుకునేందుకు నిలబడిన సైనికులు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకూ ప్రకటించలేదు. వారం రోజుల వ్యవధిలో అడెన్ ప్రాంతంలో సైనికులపై రెండోసారి దాడి జరగడం గమనార్హం. ఈనెల 10వ తేదీన అడెన్లోని సైనిక స్థావరం వద్ద సైనికులు జీతాలు తీసుకునేందుకు వేచి ఉన్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగి 50 మంది సైనికులు మృతిచెందారు. ఆ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







