ఐసీసీ వన్డే జట్టు సారథిగా విరాట్‌ కోహ్లి..

- December 22, 2016 , by Maagulf
ఐసీసీ వన్డే జట్టు సారథిగా  విరాట్‌ కోహ్లి..

2016లో టెస్టులు, వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ రూపొందించిన జట్టులోస్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతస్థాయిలో రాణించిన భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ టెస్ట్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 12 మందితో కూడిన టెస్ట్‌ జట్టులో స్థానం పొందిన ఏకైక భారత ఆటగాడిగా అశ్విన్‌ నిలిచాడు. 2016 అత్యుత్తమ టెస్ట్‌ క్రికెటర్‌గానూ అశ్విన్‌ ఎంపికయ్యాడు.

టెస్ట్‌ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నలుగురు, భారత్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున స్థానం పొందారు.

టెస్ట్‌ జట్టు సారథిగా అలిస్టర్‌ కుక్‌ ఎంపికయ్యాడు.
ఇక పరుగుల యంత్రం, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. 2016 ఐసీసీ వన్డే జట్టు సారథిగా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com