తిరుపతి వేదికగా రేపే గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల
- December 24, 2016
ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని సంక్రాంతికి విడుదల చేస్తామని ఆ చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్, నిర్మాత రాజీవ్రెడ్డి వెల్లడిం చారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శనివారం తిరుపతి ఎమ్మెల్యే సుగుణతో కలిసి మైదానాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై చర్చించారు. ఆడియో వేడుకకు ఎంతమంది వస్తారు? ఎంట్రీలెలా? వీఐపీ బ్యారికేడ్లు, స్టేజ్ నిర్మాణం వంటివాటిపై ఆడియో వేడుక నిర్వహిస్తున్న జై మీడియా ఈవెంట్ ప్రతినిధి నరేంద్రరాజుతో సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ఉంటుందన్నారు. ఆడియో వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్నటి హేమమాలినితో పాటు చిత్ర పరిశ్రమలోని నటీనటులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు.
అందరూ ఆహ్వానితులేనని.. వీవీఐపీలకు మాత్రమే ఎంట్రీ పాసులు ఇస్తున్నామన్నారు. ఆదివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఓ హోటల్ వద్ద నుంచి 500 కార్లు, 1000 ద్విచక్ర వాహనాలతో బాలకృష్ణ భారీ ర్యాలీగా ఆడియో వేదిక వద్దకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీధర్వర్మ, రవినాయుడు, నరసింహయాదవ్, బాల కృష్ణ ఫ్యాన్స్ సతీష్, మనోహర్రెడ్డి, సురేంద్ర, కోరా పృథ్వీచౌదరి, జగన్, రవితేజ, తిలక్, షఫీ, భాస్కర్రాజు, హేమంత్రాయల్, చిత్ర బృందం, పోలీసులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







